కొవిడ్‌తో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-10-28T06:03:47+05:30 IST

జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల్లో కొవిడ్‌తో రాష్ట్రంలోనే అత్యధికంగా ముగ్గురు మృతిచెందగా కొత్తగా 94 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది.

కొవిడ్‌తో ముగ్గురి మృతి

తిరుపతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల్లో కొవిడ్‌తో రాష్ట్రంలోనే అత్యధికంగా ముగ్గురు మృతిచెందగా కొత్తగా 94 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 1945కి చేరగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 246646కు పెరిగింది. కాగా బుధవారం ఉదయానికి జిల్లాలో 904 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు వున్నట్టు ప్రభుత్వ అధికారిక బులెటిన్‌ వెల్లడించింది. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 13, తిరుపతి రూరల్‌లో 10, రొంపిచెర్లలో 9, మదనపల్లెలో 8, చిన్నగొట్టిగల్లులో 7, కలికిరి, పీలేరు మండలాల్లో 5 చొప్పున, పుంగనూరులో 4, కలకడ, నారాయణవనం, తంబళ్ళపల్లె మండలాల్లో 3 వంతున, చిత్తూరు, శ్రీకాళహస్తి, ఐరాల, పులిచెర్ల, చంద్రగిరి, ఏర్పేడు మండలాల్లో 2 చొప్పున, నగరి, సదుం, పెనుమూరు, నిమ్మనపల్లె, పాకాల, పూతలపట్టు, తవణంపల్లె, తొట్టంబేడు, చౌడేపల్లె, పెద్దపంజాణి, కేవీబీపురం, వి.కోట మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-10-28T06:03:47+05:30 IST