గొర్రెను మింగబోయిన కొండచిలువ

ABN , First Publish Date - 2021-06-05T05:54:01+05:30 IST

గుడుపల్లె మండలం బిజిగానీపల్లె సమీపంలోని బండిచెరువు కాలువ వద్ద గొర్రెను కొండచిలువ మింగబోయింది.

గొర్రెను మింగబోయిన కొండచిలువ
గొర్రెను మింగిన కొండచిలువ

గుడుపల్లె, జూన్‌ 4: గుడుపల్లె మండలం బిజిగానీపల్లె సమీపంలోని బండిచెరువు కాలువ వద్ద గొర్రెను కొండచిలువ మింగబోయింది. అదే గ్రామానికి చెందిన తిమ్మప్ప శుక్రవారం తన గొర్రెలను తీసుకుని గ్రామా సమీప గుట్టల్లోకి మేతకోసం వెళ్ళాడు. సాయంత్రం గొర్రెలు గుంపుగా చేరి అరవడంతో అక్కడకు వెళ్ళిచూడగా కొండచిలువ గొర్రెను చుట్టి కొంతభాగం మింగింది. తిమ్మప్ప కేకలు వేయడంతో గ్రామస్తులకు అక్కడకు చేరుకున్నారు. పెద్దకర్ర సహాయంతో వారు గొర్రెను కొండచిలువ నుంచి తప్పించారు. గొర్రె మృతి చెందింది. అటవీశాఖ వారికి సమాచారం ఇవ్వడంతో వారు కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలి పెట్టారు.

Updated Date - 2021-06-05T05:54:01+05:30 IST