రైతు దినోత్సవం నిర్వహించే హక్కు ప్రభుత్వానికి లేదు
ABN , First Publish Date - 2021-07-08T06:49:21+05:30 IST
రాష్ట్రంలోని రైతులను అడుగ డుగునా అన్యాయం చేస్తున్న సీఎం జగన్కు రైతు దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు లేదని తెలుగురైతు నాయకులు ఆర్జే వెంకటేష్, రాటకొండ మధు బాబు అన్నారు.

మదనపల్లె టౌన్, జూలై 7: రాష్ట్రంలోని రైతులను అడుగ డుగునా అన్యాయం చేస్తున్న సీఎం జగన్కు రైతు దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు లేదని తెలుగురైతు నాయకులు ఆర్జే వెంకటేష్, రాటకొండ మధు బాబు అన్నారు. బుధవారం నిమ్మనపల్లె సర్కిల్ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో వారు మాట్లా డుతూ... రెండేళ్ల వైసీపీ పాలనతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింద న్నారు. రెండు వేలమందిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రచారం కోసం వేలకోట్లు ఖర్చుపెట్టే వైసీపీ ప్రభుత్వం రైతు ఉత్పత్తులకు మాత్రం మద్దతు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. రుణమాఫీ జీవోను కూడా రద్దు చేసి రైతులను నట్టేట ముంచిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత కోల్పోయిందన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిక జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వి.వెంకటేష్, మురళి పాల్గొన్నారు.