తిరుమలకు చేరుకున్న Chandrababu
ABN , First Publish Date - 2021-12-17T19:33:12+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు.
తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిధిగృహం వద్ద బాబుకు టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో లోకనాధం స్వాగతం పలికారు. మరికాసేపట్లో శ్రీవారిని బాబు దర్శించుకోనున్నారు. దర్శనాంతరం తిరుపతిలో జరుగుతున్న అమరావతి పరిరక్షణ సభకు టీడీపీ అధినేత వెళ్ళనున్నారు.