నేడు తిరుపతిలో చంద్రబాబు నిరసనలకు అనుమతి నిరాకరణ
ABN , First Publish Date - 2021-03-01T13:25:45+05:30 IST
నేడు తిరుపతిలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేపట్టనున్న నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
తిరుపతి: నేడు తిరుపతిలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేపట్టనున్న నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నందున చంద్రబాబు నిరసనలకు అనుమతించటం లేదని ఈస్ట్ డీఎస్పీ తెలిపారు. టీడీపీ అధినేత తిరుపతిలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని టీడీపీ పార్టీ కార్యాలయానికి, తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు, నరసింహ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ నిన్ననే టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్ధ రాత్రి అనుమతి నిరాకరిస్తున్నట్టు, సోషల్ మీడియాలో తమకు విషయం తెలిసినట్టు టీడీపీ నేతల ఇండ్లకు పోలీసులు నోటీసులు అతికించారు.