ముక్కంటి సేవలో తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2021-10-19T05:30:00+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరుడిని తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎంజే సుబ్రమణియన్ ప్రసాద్ దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి, అక్టోబరు 19: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని మంగళవారం తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎంజే సుబ్రమణియన్ ప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జడ్జికి ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకోగా వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి, ముక్కంటి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనపాల్ తదితరులు పాల్గొన్నారు.