ఆడుకుంటూ పైలోకాలకు
ABN , First Publish Date - 2021-01-19T06:10:34+05:30 IST
నీటిసంపులో పడి మదనపల్లె మండలం బసినికొండకు చెందిన ఆరేళ్ల జయంత్ మృతిచెందాడు
మదనపల్లె క్రైం, జనవరి 18: ఆటల్లో మునిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి మృతిచెందిన సంఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. వివరాలివీ.. పట్టణ పరిధిలోని బసినికొండకు చెందిన సురేష్, గౌతమి దంపతులకు కుమారుడు జయంత్(6) ఉన్నాడు. భర్త మృతితో రెండేళ్ల కిందట గౌతమి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో అమ్మమ్మ మంగమ్మ వద్ద ఉంటున్న బాలుడు సోమవారం సరదాగా ఆడుకునేందుకు వెళ్లాడు. ఆటల్లో మునిగిన జయంత్ ఎదురింట్లో తెరిచి ఉంచిన నీటిసంపులో ప్రమాదవశాత్తు పడిపోయాడు. గమనించిన స్నేహితులు కేకలు వేయడంతో స్థానికులు బాలుడిని వెలికితీసి, జిల్లా వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్సలు అందించినా, పరిస్థితి విషమించడంతో జయంత్ మృతిచెందాడు.