సాంకేతిక కారణాలతోనే మొరాయించిన సర్వర్‌

ABN , First Publish Date - 2021-12-31T07:57:58+05:30 IST

సాంకేతిక కారణాలతోనే రవాణాశాఖ సర్వర్‌ మొరాయించిందని డీటీసీ బసిరెడ్డి తెలిపారు. సర్వర్‌ హ్యాక్‌ అయినట్లు వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దన్నారు.

సాంకేతిక కారణాలతోనే మొరాయించిన సర్వర్‌

డీటీసీ బసిరెడ్డి 


తిరుపతి(రవాణా), డిసెంబరు 30: సాంకేతిక కారణాలతోనే రవాణాశాఖ సర్వర్‌ మొరాయించిందని డీటీసీ బసిరెడ్డి తెలిపారు. సర్వర్‌ హ్యాక్‌ అయినట్లు వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 31వ తేదీ రాత్రిలోపు నూతన వాహనాలను కొనుగోలు చేసినవారికి పాత ట్యాక్స్‌ విధానమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సర్వర్‌ పనిచేయక పోవడంతో ఈనెల 30,31 తేదీల్లో కొనుగోలు చేసిన వాహనాలకు జనవరి నుంచి నూతన ట్యాక్స్‌ చెల్లించాలేమోనన్న ఆందోళన వినియోగదారులకు అవసరం లేదన్నారు. సాంకేతిక సమస్యలను రవాణాశాఖ సరిదిద్దుతోందని.. అప్పటివరకు ట్యాక్సులను ఎలా చెల్లించాలో డీలర్ల గ్రూప్‌లో పొందుపరచటం జరిగిందని చెప్పారు. డీలర్లకు సందేహాలుంటే ఆర్టీఏ కార్యాలయాల్లోని డేటాబేస్‌ అనలి్‌స్టలను సంప్రదించవచ్చని సూచించారు. 

Updated Date - 2021-12-31T07:57:58+05:30 IST