గుట్కా ప్యాకెట్ల పట్టివేత
ABN , First Publish Date - 2021-05-17T06:43:25+05:30 IST
పోలీసులు గుట్కా వాహనంపై దాడి చేసి వాహనంతో సహా రూ.1.5 లక్షలు విలువ చేసే హాన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన పిచ్చాటూరు మండలం కీళపూడి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.
పిచ్చాటూరు, మే 16: పోలీసులు గుట్కా వాహనంపై దాడి చేసి వాహనంతో సహా రూ.1.5 లక్షలు విలువ చేసే హాన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన పిచ్చాటూరు మండలం కీళపూడి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హాన్స్ రవాణా చేస్తున్న మదన్(28), అంకబాబు(30) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పిచ్చాటూరు ట్రైనీ ఎస్ఐ పి.వి.మోహన్ తెలిపారు. ఈ దాడిలో కానిస్టేబుళ్లు మురళి, వినోద్, విజయ్, శేఖర్ పాల్గొన్నారు.