43కు చేరిన ఎండీయూవోల రాజీనామాలు
ABN , First Publish Date - 2021-03-07T04:44:25+05:30 IST
జిల్లాలో మొబైల్ డిస్పెన్షరీ యూనిట్ ఆపరేటర్ల రాజీనామాలు 43కు చేరాయి.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 6: జిల్లాలో మొబైల్ డిస్పెన్షరీ యూనిట్ ఆపరేటర్ల రాజీనామాలు 43కు చేరాయి. గత రెండు రోజుల వ్యఽవధిలో మదనపల్లెలో 11 మంది, చౌడేపల్లెలో ముగ్గురురాజీనామా చేశారు. శనివారం ఐరాలలో 9 మంది, పెనుమూరు, చిత్తూరులో ఇద్దరు చొప్పున రాజీనామా చేశారు. ఇది వరకు రాజీనామాలు చేసిన 16 మందితో కలిపి మొత్తం ఈ సంఖ్య 43కు పెరిగింది. కాగా, ఆపరేటర్లు రాజీనామా చేసినచోట వీఆర్వో లాగిన్తో రేషన్ పంపిణీ చేస్తున్నారు.