23 నామినేషన్ల తిరస్కరణ
ABN , First Publish Date - 2021-03-08T05:07:44+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 23 తిరస్కరణకు గురైనట్లు డీపీవో దశరధరామిరెడ్డి తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 7: జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 23 తిరస్కరణకు గురైనట్లు డీపీవో దశరధరామిరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 205 వార్డు స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ మేరకు గురువారం నుంచి శనివారం వరకు మొత్తం 260 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం నిర్వహించిన స్కూృటినీలో వివిధ కారణాలతో 23 నామినేషన్లను తిరస్కరించినట్లు డీపీవో తెలిపారు. తిరస్కరణలపై అభ్యర్థులు సోమవారం సంబంధిత అప్పిలేట్ అధికారి(ఆర్డీవోల) వద్ద అప్పీలు చేసుకోవచ్చన్నారు.