కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
ABN , First Publish Date - 2021-06-17T05:03:07+05:30 IST
కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలంటూ తొట్టంబేడులో పారా మెడికల్ ఉద్యోగ సంఘ నాయకులు డిమాండు చేశారు.
శ్రీకాళహస్తి, జూన్ 16: కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలని పారా మెడికల్ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండు చేశారు. ఆ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం తొట్టంబేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ... 20ఏళ్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నా రెగ్యులరైజ్ చేయక పోవడం బాధాకరమన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రాణాలకు తెగించి విఽధులు నిర్వరిస్తున్నా ప్రభుత్వం కరుణించడం లేదన్నారు. కార్యక్రమంలో తులసీనాథ్, రమే్షబాబు, శేఖర్రెడ్డి, మూర్తి, రేఖ, నీరజ, లావణ్య, వరలక్ష్మి, మేరీకుమారి, సంధ్య, బుజ్జి, నాగరాజమ్మ, పద్మ పాల్గొన్నారు.