30లోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-10-27T06:41:52+05:30 IST
ఏపీ ఈఏసీసెట్లో అర్హత సాధించిన ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి సూచించారు.
తిరుపతి(విద్య), అక్టోబరు 26: ఏపీ ఈఏసీసెట్లో అర్హత సాధించిన ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి సూచించారు. విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లను 30వ తేదీలోపు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక విద్యార్థుల సెల్ఫోను నెంబర్లకు సమాచారం వస్తుందన్నారు. ఏవైనా సందేహం ఉన్నవారు తిరుపతిలెపి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్, ఎస్వీయూ పాత ఎంబీఏ భవనంలో ఏర్పాటుచేసి హెల్ప్లైన్ సెంటర్లకు హాజరవ్వాలని తెలిపారు. నవంబరు 1నుంచి 5వ తేదీ వరకు ఆప్షన్లు ఇవ్వాలని, 10న అలాట్మెంట్లు జరుగుతాయన్నారు. ఇతర వివరాలకు 81068 76345, 81065 75234 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.