41 మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2021-08-26T04:58:29+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 41 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా వెదురుకుప్పం మండలంలో 72మి.మీ, అత్యల్పంగా గంగాధరనెల్లూరులో 0.2మి.మీ వర్షపాతం నమోదైంది.

41 మండలాల్లో వర్షం

చిత్తూరు (సెంట్రల్‌), ఆగస్టు 25: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 41 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా వెదురుకుప్పం మండలంలో 72మి.మీ, అత్యల్పంగా గంగాధరనెల్లూరులో 0.2మి.మీ  వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా కార్వేటినగరంలో 70, తంబళ్లపల్లెలో 60, తవణంపల్లెలో 59.2, ఎస్‌ఆర్‌ పురంలో 58.8, బంగారుపాళ్యంలో 45.6, ఐరాలలో 41.2, పుత్తూరులో 34.6, పీటీఎంలో 34.2, పెద్దమండ్యంలో 32.6, వి.కోటలో 30.2, రామకుప్పంలో 29.2, పుంగనూరులో 27.2, బి.కొత్తకోటలో 25, నారాయణవనంలో 22, పాకాలలో 20.4, పెద్దపంజాణి 19.2, బైరెడ్డిపల్లెలో 17.6, మదనపల్లెలో 17, గంగవరంలో 16.8, పాలసముద్రం, పలమనేరులో 15.6, నాగలాపురంలో 15.2, కురబలకోటలో 14.6, యాదమరిలో 13.8, కలికిరిలో 12.8, పిచ్చాటూరులో 12, పెనుమూరులో 10.6, చౌడేపల్లెలో 10.4, పూతలపట్టులో 10.2, చిత్తూరులో 10 మి.మీ వర్షం కురవగా మిగిలిన 9 మండలాల్లో 10 మి.మీ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2021-08-26T04:58:29+05:30 IST