ఐసీఏఐ చిత్తూరు జిల్లా చైర్మన్గా పాండుకుమార్
ABN , First Publish Date - 2021-02-25T04:45:49+05:30 IST
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) జిల్లా చైర్మన్గా మిట్టూరుకు చెందిన చార్టెట్ అకౌంటెంట్ సి.పాండుకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చిత్తూరు, ఫిబ్రవరి 24: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) జిల్లా చైర్మన్గా మిట్టూరుకు చెందిన చార్టెట్ అకౌంటెంట్ సి.పాండుకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021-22 సంవత్సరానికి ఈయన జిల్లాలోని చార్టెడ్ అకౌంట్స్ యూనియన్ చైర్మన్గా కొనసాగుతారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన పాండుకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని చార్టెడ్ అకౌంట్లను వాణిజ్యపన్నులశాఖ, ఆదాయపు పన్నుశాఖ యంత్రాంగంతో సమన్వయం చేస్తానన్నారు. సీఏ కోర్సు చేస్తున్న విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, వృత్తిపరమైన మెళకువలు, శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. సీఏల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.