ధాన్యం సేకరణ ప్రారంభం
ABN , First Publish Date - 2021-03-09T06:59:53+05:30 IST
శ్రీకాళహస్తి ఏపీసీడ్స్లో సోమవారం నుంచి ధాన్యం సేకరణ మొదలైంది.
శ్రీకాళహస్తి, మార్చి 8: పట్టణ పరిధిలోని ఏపీసీడ్స్లో సోమవారం నుంచి ధాన్యం సేకరణ మొదలైంది. ఈనెల 5వతేది నుంచే కొనుగోళ్లు జరిపేందుకు అఽధికారులు ప్రకటన ఇచ్చారు. అయితే మంచి ముహూర్తం కోసం వేచిచూసిన రైతులు సోమవారం ధాన్యం తీసుకువచ్చారు. దీంతో ఏపీసీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య ధాన్యానికి పూజలు చేశారు. ఆ మేరకు 2 వేల క్వింటాళ్లు ధాన్యం సేకరణ జరిగింది.