తిరుమలలో ముసురు
ABN , First Publish Date - 2021-11-28T07:12:25+05:30 IST
తిరుమలలో శనివారం మొత్తం నల్లటి ముసురు అలుముకుంది. వేకువ జాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా చిన్నపాటి చినుకులు పడుతూనే ఉన్నాయి.
తిరుమల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం మొత్తం నల్లటి ముసురు అలుముకుంది. వేకువ జాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా చిన్నపాటి చినుకులు పడుతూనే ఉన్నాయి. దీంతో శ్రీవారి ఆలయంతోపాటు మాడవీధులు, రోడ్డు, కాటేజీలు తేమతో కనిపిస్తున్నాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు చిన్నపాటి వర్షంలోనే తడుస్తూ వెళ్లడం కనిపించింది. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చినవారు ఇబ్బంది పడ్డారు. చలితీవ్రత అధికం కావడంతో చాలా మంది భక్తులు దర్శనం తర్వాత తిరుమల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు వర్షానికి నానితే కొండచరియలు విరిగిపడే అవకాశముందనే అంచనాతో టీటీడీ ఇంజనీరింగ్, ఫారెస్ట్, విజిలెన్స్ అధికారులు ఘాట్రోడ్లపై నిఘా పెట్టారు. అనుకోకుండా ఎక్కడైనా కొంచచరియలు విరిగిపడితే వెంటనే తొలగించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.