రాబోయే రోజుల్లో 8th నుంచి కోడింగ్ విద్య తప్పనిసరి: మంత్రి ఆదిమూలపు
ABN , First Publish Date - 2021-02-27T19:18:55+05:30 IST
రాష్ట్రంలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
తిరుపతి: రాష్ట్రంలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్లు విధులు సరిగ్గా నిర్వర్తించకున్నా, టీచింగ్ ఆక్టివిటీలో పాల్గొనక పోయినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో 8th నుంచి కోడింగ్ విద్య తప్పనిసరి ఉంటుందని తెలిపారు. ఒంగోలులో టీచర్ ట్రైనింగ్కు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాబోయే ఏడాది నుంచి ఇంటర్ నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంటు పరిధిలో స్కిల్ డెవలెప్మెంట్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.