ఉన్నత విలువలతో జీవనం సాగించాలి
ABN , First Publish Date - 2021-10-31T06:39:04+05:30 IST
విద్యార్థులు ఉన్నత విలువలతో కూడిన జీవనం సాగించాలని ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులురెడ్డి కోరారు.
![ఉన్నత విలువలతో జీవనం సాగించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921103101060198/10312021010656n93.gif)
శ్రీకాళహస్తి, అక్టోబరు 30: విద్యార్థులు ఉన్నత విలువలతో కూడిన జీవనం సాగించాలని ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులురెడ్డి కోరారు. పట్టణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుకుమార్రెడ్డి పదవీవిరమణ సందర్భంగా శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన్ను ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... అధ్యాపకుడిగా సుకుమార్రెడ్డి అందించిన సేవలు మరువలేమని కొనియాడారు. సమాజంలో గురువు స్థానం మహోన్నతమైందన్నారు. మార్కులు, ర్యాంకులతో విద్యార్థులు ఉద్యోగాలు మాత్రమే పొందవచ్చని అన్నారు. అయితే సంస్కారవంతంగా జీవిస్తే ఉన్నతస్థాయికి ఎదగవచ్చని సూచించారు. అధ్యాపకులకు పెండింగ్ అరియర్స్ మంజూరుకు కృషిచేస్తామన్నారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలుకు సహకరిస్తానని గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, బియ్యపు పవిత్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.