దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి సమావేశాన్ని విజయవంతం చేద్దాం

ABN , First Publish Date - 2021-02-27T05:26:00+05:30 IST

తిరుపతిలో మార్చి 4న జరగనున్న దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పిలుపునిచ్చారు.

దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి  సమావేశాన్ని విజయవంతం చేద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

కలెక్టర్‌ హరినారాయణన్‌


చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: తిరుపతిలో మార్చి 4న జరగనున్న దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 4న జరిగే దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి సమావేశం తిరుపతిలో నిర్వహించడం మరువలేని అవకాశం అని అన్నారు. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, ఏపీ సీఎం జగన్‌తో పాటు దక్షిణాది రాష్ర్టాల సీఎంలు, వీఐపీలు హాజరవుతారని చెప్పారు. సమావేశంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా లైజన్‌ ఆఫీసర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పాల్గొనడానికి తిరుపతికి చేరుకునే అతిథులకు రవాణా, వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌, డీఆర్వో మురళి, తిరుపతి స్మార్ట్‌ సిటీ జీఎం చంద్రమౌళి, చిత్తూరు ఆర్డీవో రేణుక, వివిధ శాఖల అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:26:00+05:30 IST