వెళ్లామా.. కూర్చున్నామా.. తిరిగొచ్చామా..!
ABN , First Publish Date - 2021-04-13T05:48:49+05:30 IST
వెళ్లామా.. కూర్చున్నామా... తిరిగొచ్చామా అన్నట్లుగా మారింది కొత్త సర్పంచ్ల తీరు.
చెక్ పవర్ లేకపోవడంతో ఉత్సవ విగ్రహాల్లా సర్పంచ్లు
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 12: వెళ్లామా.. కూర్చున్నామా... తిరిగొచ్చామా అన్నట్లుగా మారింది కొత్త సర్పంచ్ల తీరు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినా దాదాపు నెలన్నర తరువాత ఈ నెల 3న అధికారికంగా సర్పంచులకు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం సర్పంచులకు చెక్పవర్ ఇవ్వలేదు. ఎప్పుడిస్తోరో కూడా తెలియదు. పంచాయతీలో ఏ పని చేయాలన్నా సర్వధికారాలు సర్పంచ్కే ఉంటాయి. కాని చెక్పవర్ లేకపోవడంతో సర్పంచ్లు ప్రస్తుతం కార్యాలయానికి వెళ్లి కాలక్షేపం చేసి రావడం తప్ప మరే పనీ చేయలేని పరిస్థితి. ఆర్థిక సంఘం ఇతరత్రా నిధులు పంచాయతీ ఖాతాల్లో సమృద్ధిగా ఉన్న పైసా కూడా డ్రా చేయలేని నిస్సహాయతలో ఉన్నారు. ఇదిలా ఉండగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. నీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతుండడంతో సర్పంచులు చెక్పవర్ లేక ఆందోళనకు గురవుతున్నారు.