కుప్పంలో ABNను చూసి పారిపోయిన సీఐ

ABN , First Publish Date - 2021-11-15T17:18:41+05:30 IST

కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోంది. కుప్పంలోకి వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు.

కుప్పంలో ABNను చూసి పారిపోయిన సీఐ

చిత్తూరు: కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోంది. కుప్పంలోకి వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు. దొంగ ఓటర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై సీఐని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పలుకరించగా ఆయన మాట్లాడకుండా తప్పించుకుని వెళ్లిపోయారు. ఇక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులను బెదిరించే విధంగా వ్యవహరిస్తున్నారు. దొంగ ఓటర్లను టీడీపీ కార్యకర్తలు పట్టిచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదు. వైసీపీ శ్రేణులు భయానక వాతావరణం సృష్టిస్తున్నా.. టీడీపీ నేతలు వెనక్కి తగ్గడంలేదు. న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కుప్పంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.

   

ఇదేంటని ప్రశ్నించిన టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు ఎదురు దాడులకు దిగుతున్నారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు పోల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. వైసీపీ శ్రేణులకు పోలీస్ సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. 16, 19 వార్డుల్లో టీడీపీ శ్రేణులు దొంగ ఓటర్లను పట్టుకున్నారు. ఈ విషయంలో పోలీసులు బుకాయిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీకి చెందిన దొంగ ఓటర్లు భారీగా మోహరించారు.

Updated Date - 2021-11-15T17:18:41+05:30 IST