కెంపసముద్రం ఎద్దుకు రూ.70 వేల బహుమతి

ABN , First Publish Date - 2021-02-26T07:04:07+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో రామకుప్పం మండలం కెంపసముద్రం గ్రామానికి చెందిన మరో ఎద్దు తన యజమానికి రూ.70వేల నగదు బహుమతిని అందించింది.

కెంపసముద్రం ఎద్దుకు రూ.70 వేల బహుమతి
బహుమతి చేజిక్కించుకున్న ఎద్దు

రామకుప్పం, ఫిబ్రవరి 25: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో రామకుప్పం మండలం కెంపసముద్రం గ్రామానికి చెందిన మరో ఎద్దు తన యజమానికి రూ.70వేల నగదు బహుమతిని అందించింది. తమిళనాడులోని కిరిసముద్రంలో బుధవారం జల్లికట్టు పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ఎద్దులు పాల్గొన్నాయి. శంకరప్పకు చెందిన ఎద్దు మెరుపు వేగంతో 10.01 సెకన్ల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది. ఎద్దును కట్టడి చేసేందుకు సుక్షితులైన యువకుల బృందం చేసిన ప్రయత్నాలు విఫలయమ్యాయి. దీంతో ఆ ఎద్దు యజమానికి నిర్వాహకులు రెండో నగదు బహుమతిగా రూ.70వేలను అందజేశారు.  

Updated Date - 2021-02-26T07:04:07+05:30 IST