కర్ణాటక మద్యం స్వాధీనం: ముగ్గురి అరెస్టు
ABN , First Publish Date - 2021-05-11T09:37:45+05:30 IST
ర్ణాటక నుంచి తిరుపతికి తరలిస్తున్న 23 బాక్సుల మద్యం బాటిళ్లను ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుచానూరు, మే 10: కర్ణాటక నుంచి తిరుపతికి తరలిస్తున్న 23 బాక్సుల మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. తిరుపతి రూరల్ సీఐ నాగరాజురెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సోమవారం తిరుపతి రూరల్ ఎస్ఈబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తిరుచానూరు ఫ్లై ఓవర్ వద్ద కారును తనిఖీ చేయగా.. 23 బాక్సులో 1104 కర్ణాటక మద్యం బాటిళ్లు కనిపించాయి. మద్యం బాటిళ్లతోపాటు కారును సీజ్ చేసి కేసు నమోదుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తుండిన తిరుపతి, ఎస్ఆర్పురం మండలాలకు చెందిన సుధాకర్రెడ్డి, విక్రం, శ్రీపతిరెడ్డిలను అరెస్టు చేశారు. మద్యాన్ని పెద్ద ఎత్తున సీజ్ చేసి, నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఏఈఎస్ సుధీర్బాబు అభినందించారు.