కాణిపాక ఆలయ హుండీ ఆదాయం రూ. 56.27 లక్షలు

ABN , First Publish Date - 2021-07-08T06:22:23+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 56,27,782 లభించినట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో బుధవారం ఈవో వెంకటేశు పర్యవేక్షణలో వరసిద్ధుడి కానుకలను లెక్కించారు.

కాణిపాక ఆలయ హుండీ ఆదాయం రూ. 56.27 లక్షలు
ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది

ఐరాల(కాణిపాకం), జూలై 7:కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 56,27,782 లభించినట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో బుధవారం ఈవో వెంకటేశు పర్యవేక్షణలో వరసిద్ధుడి కానుకలను లెక్కించారు. ఈ ఆదాయంలో 32 గ్రాముల బంగారు, 3.220 కిలోల వెండి, 106 యూఎ్‌సఏ డాలర్లు లభ్యమయ్యాయి. ఆలయానికి ఆదాయం 28 రోజుల్లో సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ లెక్కింపులో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, చిట్టెమ్మ, చంద్రశేఖర్‌, సుధారాణి, సీఎ్‌ఫవో నాగేశ్వరరావు, పర్యవేక్షకులు శ్రీధర్‌బాబు, కోదండపాణి,ఎ్‌సఐలు రమే్‌షబాబు, లోకేష్‌, యూనియన్‌ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-07-08T06:22:23+05:30 IST