సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జనార్దన్ యాదవ్
ABN , First Publish Date - 2021-08-02T06:22:49+05:30 IST
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి రూరల్ మండలం వేదాంతపురానికి చెందిన చెరుకుల జనార్దన్ యాదవ్ ఎన్నికయ్యారు.
తిరుపతి రూరల్, ఆగస్టు 1: సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి రూరల్ మండలం వేదాంతపురానికి చెందిన చెరుకుల జనార్దన్ యాదవ్ ఎన్నికయ్యారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన రెండోసారి ఎన్నిక కావడం గమనార్హం. అలాగే.. జిల్లా కార్యదర్శిగా రమేష్, ఉపాధ్యక్షులుగా మల్లేశ్వరి, సహాయ కార్యదర్శులుగా జయప్రకాష్, శివరంజని, కోశాధికారిగా సుధారాణి, కార్యవర్గ సభ్యులుగా కుసుమ, దేవానంద్, కిషోర్, దొరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి సయ్యద్ సాహెబ్, రాష్ట్ర పరిశీలకుడిగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశులు, రిటర్నింగ్ అధికారిగా సీహెచ్ఎంసీ రాజు వ్యవహరించారు. ఈ సందర్భంగా జనార్దన్ యాదవ్ను పలువురు సత్కరించారు.