వలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-12-19T05:52:42+05:30 IST
జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులకు ఈ నెల 20నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జేసీ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
![వలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 18: జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులకు ఈ నెల 20నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జేసీ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పారు. 20నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ, 27న స్ర్కూటినీ, 28న ఇంటర్వ్యూలు, ఎంపికైన అభ్యర్థులకు 30న నియామకపత్రాలను అందజేస్తామని జేసీ పేర్కొన్నారు.