రిమాండు ఖైదీ మృతిపై 31న విచారణ
ABN , First Publish Date - 2021-07-25T07:19:21+05:30 IST
రుయాస్పత్రిలో చికిత్స పొందుతూ 2020 జూలై 27న మృతి చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన పి.మద్దిలేటి అలియాస్ మల్లికార్జున అనే రిమాండు ఖైదీ మృతిపై ఈనెల 31న తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయంలో విచారణ జరగనుంది.
తిరుపతి సిటీ, జూలై 24: రుయాస్పత్రిలో చికిత్స పొందుతూ 2020 జూలై 27న మృతి చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన పి.మద్దిలేటి అలియాస్ మల్లికార్జున అనే రిమాండు ఖైదీ మృతిపై ఈనెల 31న తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయంలో విచారణ జరగనుంది. ఈ మేరకు ఆర్డీవో కనకనరసారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓ కేసులో అరెస్టయి.. తిరుపతిలోని ప్రత్యేక సబ్జైలులో శిక్ష అనుభవిస్తున్న మల్లికార్జున్ అనారోగ్యానికి గురవడంతో సబ్జైలు సిబ్బంది 2020 జూలై 27న ఆయన్ను చికిత్స నిమిత్తం రుయాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. దీనిపై విచారించి, నివేదిక ఇవ్వాలని శనివారం ఆర్డీవోకు కలెక్టర్ హరినారాయణన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపడుతున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. వాస్తవాలు తెలిసిన వారెవరైనా ఈ విచారణకు హాజరుకావాలని ఆయన కోరారు.