చెరువుల్లో గంబూసియా చేపలు

ABN , First Publish Date - 2021-06-08T05:23:33+05:30 IST

దోమల నివారణకు చెరువుల్లో గంబూసియా చేప పిల్లలు వదిలినట్లు డివిజన్‌ మలేరియా అధికారి గఫూర్‌ పేర్కొన్నారు.

చెరువుల్లో గంబూసియా చేపలు
కోమటివానిచెరువులో గంబూసియా చేపపిల్లలను వదులుతున్న వైద్య సిబ్బంది

మదనపల్లె టౌన్‌, జూన్‌ 7: దోమల నివారణకు చెరువుల్లో గంబూసియా చేప పిల్లలు వదిలినట్లు డివిజన్‌ మలేరియా అధికారి గఫూర్‌ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని కోమటివానిచెరువు, గజ్జెలగుంటలో, సీటీఎం చెరువుల్లో వైద్య సిబ్బంది గంబూషియా చేపపిల్లలను వదిలారు. హెల్త్‌ అసిస్టెంట్‌ మధు  మాట్లాడుతూ... మురుగునీటిలో దోమల లార్వా పెరగకుండా గంబూ షియా చేపలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. 

Updated Date - 2021-06-08T05:23:33+05:30 IST