చిత్తూరు డీవైఈవోకు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు
ABN , First Publish Date - 2021-06-30T05:59:52+05:30 IST
చిత్తూరు డీవైఈవోగా పనిచేస్తున్న పురుషోత్తంకు ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జి) కింద డీఈవోగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
చిత్తూరు (సెంట్రల్), జూన్ 29: డీఈవోగా పనిచేస్తున్న నరసింహారెడ్డి బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈస్థానంలో చిత్తూరు డీవైఈవోగా పనిచేస్తున్న పురుషోత్తంకు ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జి) కింద డీఈవోగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. నరసింహారెడ్డికి బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు.