మదనపల్లె ఫైన్ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు సూర్యనారాయణ కన్నుమూత
ABN , First Publish Date - 2021-02-25T06:24:30+05:30 IST
మదనపల్లె ఫైన్ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు కోటకొండ సూర్యనారాయణ అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందారు.
మదనపల్లె అర్బన్ ఫిబ్రవరి 24: మదనపల్లె ఫైన్ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు కోటకొండ సూర్యనారాయణ అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందారు.కొద్ది రోజులుగా షుగర్ వ్యాధితో భాదపడుతున్న ఆయన తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.31 ఏళ్లుగా మదనపల్లె ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా సంప్రదాయ కళలకు జీవం పోస్తూ వచ్చిన సూర్యనారాయణ ఏటా వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి బహుమతులందించేవారు.గత నెల 30న మదనపల్లె పట్టణ సమీపంలోని వెలుగు ప్రత్యేక పాఠశాలలో 21మంది కళాకారులకు, వివిధ రంగాల్లో సేవలందించిన వారికి, కరోనా నేపధ్యంలో ముందుండి సేవసేసిన వారికి ప్రత్యేకంగా పురస్కారాలను అందజేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.సూర్యనారాయణ అంత్యక్రియలు మదనపల్లె పట్టణం అమ్మచెరువు మిట్టలోని ఆయన స్వగృహం వద్ద గురువారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.