తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం
ABN , First Publish Date - 2021-08-12T23:48:23+05:30 IST
తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం రేగింది. భక్తులకు దళారులు నకిలీ టికెట్లు అంటగడుతున్నారు.
తిరుపతి: తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం రేగింది. భక్తులకు దళారులు నకిలీ టికెట్లు అంటగడుతున్నారు. హైదరాబాద్ భక్తులకు దళారులు రెండు నకిలీ టికెట్లు అమ్మారు. రూ.300 టికెట్లను మార్ఫింగ్ చేసి రూ.4,400కు విక్రయించారు. దర్శన టికెట్లను మార్ఫింగ్ చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్అధికారులు గుర్తించింది. కేటాయించిన రూ.300 టికెట్ల కంటే ఎక్కువ మంది దర్శనం చేసుకుంటున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల మార్ఫింగ్పై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. తిరుపతిలోని ట్రావెల్స్ నిర్వాహకుల నకిలీ టికెట్లు అమ్మినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.