ఈవోలకు అద నపు బాధ్యతలు
ABN , First Publish Date - 2021-08-03T06:49:15+05:30 IST
దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ తదితర కార్యక్రమాల కోసం ఈవోలకు అదనంగా బాధ్యతలు అప్పచెప్పినట్లు జిల్లా అసిస్టెంట్ కమిషనరు ఏకాంబరం తెలి పారు.
చిత్తూరు కల్చరల్, ఆగస్టు 2: దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ తదితర కార్యక్రమాల కోసం ఈవోలకు అదనంగా బాధ్యతలు అప్పచెప్పినట్లు జిల్లా అసిస్టెంట్ కమిషనరు ఏకాంబరం తెలి పారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిషనర్ సూచనలతో 66మండలాల్లోని ఆలయాల ఈవోలకు పరిసర ప్రాంతాల ఆలయాల పరిరక్షణ, ఆస్తుల పర్యవేక్షణను బదలాయించినట్లు తెలిపారు. కార్యాలయ సూపరింటెండెంట్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.