ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి గడువు పెంపు
ABN , First Publish Date - 2021-05-18T06:17:20+05:30 IST
ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లు పొందడానికి గడువును పొడిగించినట్లు డీఈవో నరసింహారెడ్డి, ఏడీ నాగరాజు తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), మే 17: ఆదర్శ పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 16వ తేదీకి ముగిసిన గడువును పొడిగించినట్లు డీఈవో నరసింహారెడ్డి, ఏడీ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా తమ పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.