డాక్యుమెంట్ రైటర్ల సహాయ నిరాకరణ
ABN , First Publish Date - 2021-05-17T05:02:10+05:30 IST
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని నెలాఖరు వరకు కొనసాగించాలని చిత్తూరు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ తీర్మానించింది.
చిత్తూరు కలెక్టరేట్, మే 16: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని నెలాఖరు వరకు కొనసాగించాలని చిత్తూరు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ తీర్మానించింది. ఆదివారం చిత్తూరులో సంఘ అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. సంఘ ఉపాధ్యక్షుడు రవి, కార్యద ర్శి హేమచంద్ర, పలువురు డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు.