ఎస్వీబీసీ 3,4లో దివ్యకాశీ-భవ్యకాశీ ప్రత్యక్షప్రసారం

ABN , First Publish Date - 2021-12-15T07:22:51+05:30 IST

ప్రఽధాని మోదీ చేతుల మీదుగా డిసెంబరు 13వ తేదీన నిర్వహించిన దివ్యకాశీ భవ్యకాశీ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ 3,4 చానళ్లలో ప్రత్యక్షప్రసారం చేశామని, శ్రీవారి కల్యాణోత్సవం తర్వాత తెలుగు చానల్‌లోనూ ఈ కార్యక్రమం ప్రసారమైందని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

ఎస్వీబీసీ 3,4లో దివ్యకాశీ-భవ్యకాశీ ప్రత్యక్షప్రసారం

ప్రసారాలు జరగలేదని ఆరోపించడం బాధాకరం: టీటీడీ


తిరుమల, డిసెంబరు14(ఆంధ్ర జ్యోతి): ప్రఽధాని మోదీ చేతుల మీదుగా డిసెంబరు 13వ తేదీన నిర్వహించిన దివ్యకాశీ భవ్యకాశీ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ 3,4 చానళ్లలో ప్రత్యక్షప్రసారం చేశామని, శ్రీవారి కల్యాణోత్సవం తర్వాత తెలుగు చానల్‌లోనూ ఈ కార్యక్రమం ప్రసారమైందని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయలేదని కొందరు ప్రసార మాధ్యమాల ద్వారా ఆరోపించడం బాధాకరమని, టీటీడీపై బురద జల్లడమే లక్ష్యంగా అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ తెలిపింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆరోపణలు చేసేముందు వాస్తవాలను నిర్ధారణ చేసుకోవాలని కోరుతున్నామని, ఆధ్యాత్మిక సంస్థపై అవాస్తవాలతో కూడిన ప్రకటనలు ఇవ్వడం మంచిదికాదని తెలిజేస్తున్నామని తెలిపింది. 

Updated Date - 2021-12-15T07:22:51+05:30 IST