తొలి రోజు 14వేల మంది రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-18T06:13:37+05:30 IST
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ మొదలైంది.
చిత్తూరు (సెంట్రల్), మే 17: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ మొదలైంది. తొలిరోజున 185 ఆర్బీకేల ద్వారా 14,650 మంది రైతులకు 6,535 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. మదనపల్లె డివిజన్లో అత్యధిక మండలాలతోపాటు చిత్తూరు డివిజన్లోని కొన్ని మండలాల్లో తొలి విడతగా పంపిణీ జరిగింది. మొత్తం 70వేల మంది రైతులు నమోదు చేసుకోగా 35వేల మంది సబ్సిడీ ధర కింద బస్తాకు రూ.1563 చెల్లించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులకు జేడీ దొరసాని ఆదేశాలు జారీ చేశారు.