పంటనష్టం నమోదు
ABN , First Publish Date - 2021-11-28T05:44:06+05:30 IST
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను నిమ్మనపల్లె ఏవో చంద్రశేఖర్ పరిశీలించి నష్టాన్ని నమోదు చేశారు
నిమ్మనపల్లె, నవంబరు 27: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఏవో చంద్రశేఖర్ పరిశీలించి నష్టాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తుఫాన్ కారణంగా వరితోపాటు అన్ని పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఈ ఏడాది 1,904 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా ప్రాథమిక అంచనా ప్రకారం 1,212 ఎకరాల్లో నష్టపోయారన్నారు. అలాగే వేరుశనగ 112 ఎకరాల్లో, కంది 25, టమోటా 25, వంగ 10, బొప్పాయి 32 ఎకరాల్లో దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. ఇప్పటి వరకు నిమ్మనపల్లె, కొండయ్యగారిపల్లె, తవళం, అగ్రహారం, ముష్టూరు, సామకోటవారిపల్లె పంచాయతీల్లో పంట నష్టం అంచనా వేసినట్లు చెప్పారు.