పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి

ABN , First Publish Date - 2021-12-04T05:52:39+05:30 IST

వరదలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్‌ చేశారు.

పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి
బెస్తపల్లె వద్ద దెబ్బతిన్న వరిపంటను పరిశీలిస్తున్న టీడీపీ నేత మధుబాబు

తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు


మదనపల్లె టౌన్‌, డిసెంబరు 3: వరదలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మదనపల్లె మండలం బెస్తపల్లె వద్ద రైతులు పండించిన వరి పంటను మధుబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోత దశలో ఉన్న వరి అధిక వర్షాలతో దెబ్బతిందన్నారు. ప్రభుత్వం   పరిశీలించి తూతూమంత్రంగా కాకుండా ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వెంకటేష్‌, పూల మురళి, తిమ్మరాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-04T05:52:39+05:30 IST