నిత్యావసరాలు అందకుంటే 104కు ఫిర్యాదు చేయండి
ABN , First Publish Date - 2021-11-23T07:42:21+05:30 IST
వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే నిత్యావసర సరుకులు అందకున్నా.. ఇబ్బందులు ఎదురైనా 104 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ హరినారాయణన్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
![నిత్యావసరాలు అందకుంటే 104కు ఫిర్యాదు చేయండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వరద బాధితులకు కలెక్టర్ సూచన
చిత్తూరు (సెంట్రల్), నవంబరు 22: వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే నిత్యావసర సరుకులు అందకున్నా.. ఇబ్బందులు ఎదురైనా 104 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ హరినారాయణన్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇళ్లలో నీరు చేరి ముంపునకు గురై ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఎర్రగడ్డలు, బంగాళా దుంపలు, లీటరు వంట నూనె పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.