నేటి నుంచి బ్యాంకు పనివేళల్లో మార్పు
ABN , First Publish Date - 2021-05-06T06:10:41+05:30 IST
బ్యాంకు పనివేళల్లో గురువారం నుంచి మార్పు చోటు చేసుకోనుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేస్తాయి.
చిత్తూరు కలెక్టరేట్, మే 5: బ్యాంకు పనివేళల్లో గురువారం నుంచి మార్పు చోటు చేసుకోనుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎ్సఎల్బీసీ) అన్ని జిల్లాల ఎల్డీఎంలకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో ఎస్ఎల్బీసీ సబ్ కమిటీ సమావేశమై బ్యాంకు పనివేళల మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. సవరించిన బ్యాంకు పనివేళలు ఈ నెల 18వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు కొనసాగుతాయని ఆ ఉత్తర్వులు పేర్కొంది. కర్ఫ్యూ కారణంగా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు బ్యాంకు పనివేళల్లో మార్పులు చేపట్టినట్లు ఎల్డీఎం గణపతి తెలిపారు. బ్యాంకులను కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయిస్తూ అత్యవసర సర్వీసుల కింద గుర్తిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం జీవో విడుదల చేశారు.