ముక్కంటి సేవలో ప్రముఖులు

ABN , First Publish Date - 2021-06-19T05:48:38+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరస్వామిని కర్ణాటక దేవదాయ శాఖ కమిషనర్‌, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఐఆర్‌ఎస్‌ అధికారి సొంఖా దర్శించుకున్నారు.

ముక్కంటి సేవలో ప్రముఖులు
రోహిణికి క్యాలెండరు అందజేస్తున్న ఈవో

శ్రీకాళహస్తి, జూన్‌ 18: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శుక్రవారం కర్ణాటక రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనరు రోహిణి సింధూరి దర్శించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐఆర్‌ఎస్‌ అఽధికారి సొంఖా కుటుంబసభ్యులతో కలసి వేర్వేరుగా ముక్కంటీశుడిని దర్శించుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకున్న ప్రముఖులను వేద పండితులు ఆశీర్వదించి ముక్కంటి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏపీఆర్వో హరిబాబు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:48:38+05:30 IST