ఈ కరెంటు బిల్లులు మేం కట్టలేం?!
ABN , First Publish Date - 2021-10-17T08:04:03+05:30 IST
‘ఈ కరెంటు బిల్లులు మేం కట్టలేం’ అంటూ చంద్రగిరి మండలంలోని భీమవరం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
భీమవరం సచివాలయం ముందు గ్రామస్తులు నిరసన
చంద్రగిరి, అక్టోబరు 16: ‘ఈ కరెంటు బిల్లులు మేం కట్టలేం’ అంటూ చంద్రగిరి మండలంలోని భీమవరం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామ సచివాలయం ముందు నిరసన తెలిపారు. గ్రామంలో నెలనెలా వచ్చే కరెంటు బిల్లులపై ఒక్కొక్కరికి రూ.500, రూ.వెయ్యి వరకు పెరిగిందన్నారు. అందరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ చార్జీలు తగ్గించే వరకు బిల్లులు కట్టేది లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు.