బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలి
ABN , First Publish Date - 2021-10-29T05:45:56+05:30 IST
మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్కుమార్ డిమాండ్ చేశారు. . బీసీటీ యజమాన్యం ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించకుండా, కళాశాలను మూసివేసే ధోరణిలో ఉందన్నారు.
మదనపల్లె టౌన్, అక్టోబరు 28: పట్టణంలోని బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం బీసెంట్ సర్కిల్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన రాస్తారోకో సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర వున్న బీటీ కళాశాలను ఎయిడెడ్ అధ్యాపకులు ప్రభుత్వంలో విలీనం అయ్యారన్నారు. బీసీటీ యజమాన్యం ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించకుండా, కళాశాలను మూసివేసే ధోరణిలో ఉందన్నారు. దీని వలన పేద విద్యార్థులకు విద్య అందడం కష్టతరమన్నారు. ఇప్పటికైనా కళాశాల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని బీసీటీని డిమాండ్ చేశారు. మాధవ, జయప్రకాష్, చైతన్య, సంతోష్, స్నేహ, రమ్యశ్రీ, మీనా, భవ్య తదితరులు పాల్గొన్నారు.