12 సింగిల్విండోలకు పర్సన్ ఇన్చార్జిల నియామకం
ABN , First Publish Date - 2021-12-08T07:19:53+05:30 IST
12 సింగిల్విండోలకు పర్సన్ ఇన్చార్జిలను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
![12 సింగిల్విండోలకు పర్సన్ ఇన్చార్జిల నియామకం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 7: పదవీకాలం పూర్తయిన 12 వ్యవసాయ ప్రాథమిక పరపతి సహకార సంఘాల(సింగిల్విండోల)కు పర్సన్ ఇన్చార్జిలను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఫిషియల్ పర్సన్ ఇన్చార్జిలుగా అసిస్టెంట్ రిజిస్ర్టార్లు, సబ్డివిజన్ కో-ఆపరేటివ్ ఆఫీసర్లు బాధ్యతలు స్వీకరించారు. మొలకలచెరువు మండలం సోంపల్లె, విజయపురం మండలం అగరం రామకృష్ణ, తవణంపల్లె మండలం అరగొండ, కొండ్రాజుకాలువ, దిగువమాఘం, పలమనేరు మండలం బయ్యప్పగారిపల్లెతోపాటు చిన్నగొట్టిగల్లు, పుంగనూరు, బైరెడ్డిపల్లె, సదుం, నిండ్ర, పెనుమూరు సింగిల్ విండోలకు అధికారుల పాలన ప్రారంభమైంది.