రోడ్లన్నీ.. ఖాళీనే..
ABN , First Publish Date - 2021-01-01T07:43:56+05:30 IST
కరోనా నేపథ్యంలో ఈసారి నూతన సంవత్సరాది వేడుకలపై ఆంక్షలు విధించడంతో జనం వీధుల్లోకి రాలేదు.
ఏటా డిసెంబరు 31 రాత్రి రోడ్లన్నీ సందడిగా కన్పించడమే మనకు తెలుసు.కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ వీధుల్లోకొచ్చే యువత అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ సంబరాలు చేసుకోవడం చూశాం. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి నూతన సంవత్సరాది వేడుకలపై ఆంక్షలు విధించడంతో జనం వీధుల్లోకి రాలేదు.పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహిస్తుండడంతో గురువారం రాత్రి రోడ్లన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. బేకరీల వద్దే కొంత హడావిడి కన్పించింది.అయితే పగలు మాత్రం సంవత్సరాది షాపింగ్ సందడి కొనసాగింది. తిరుమలలో రాత్రి 12 గంటలకు శ్రీవారి ఆలయం ముందు భక్తులంతా గుమికూడి సందడి చేశారు.