కరోనా సోకిందని ఓ మహిళ అత్మహత్య

ABN , First Publish Date - 2021-05-06T05:42:17+05:30 IST

కరోనా సోకిందని తెలిసి ఓ మహిళ ఉరేసుకొని అత్మహత్య చేసుకున్న సంఘటన గుర్రంకొండ హరిజనవాడలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది.

కరోనా సోకిందని ఓ మహిళ అత్మహత్య

గుర్రంకొండ, మే 5: కరోనా సోకిందని తెలిసి ఓ మహిళ ఉరేసుకొని అత్మహత్య చేసుకున్న సంఘటన గుర్రంకొండ హరిజనవాడలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. కలకడ మండలం నడిమిచెర్ల పంచాయితీ మొటుకు హరిజనవాడకు చెందిన వెంకటలక్ష్మి(65), కృష్ణయ్య దంపతులు కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం గుర్రంకొండ హరిజనవాడలో నివాసముంటున్న కుమార్తె ఇంటికి వచ్చారు. దీంతో వెంకటలక్ష్మికి జ్వరం వచ్చింది. నాలుగు రోజుల క్రితం కరోనా పరీక్ష చేయించగా మంగళవారం సాయంత్రం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం అర్ధరాత్రి ఉరేసుకొని అత్మహత్య చేసుకొంది. 

Updated Date - 2021-05-06T05:42:17+05:30 IST