గురుకుల ప్రవేశ పరీక్షకు 38మంది హాజరు
ABN , First Publish Date - 2021-08-02T04:45:24+05:30 IST
వాల్మీకిపురం బాలయోగి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి ఆదివారం పరీక్షలు నిర్వహించారు.
వాల్మీకిపురం, ఆగస్టు 1: వాల్మీకిపురం బాలయోగి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి ఆదివారం పరీక్షలు నిర్వహించారు. స్థానిక తరిగొండ రోడ్డులోని ఏపీ మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 55మంది దరఖాస్తు చేసుకోగా 38మంది హాజరయ్యారు. 17మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఎగ్జామ్ చీఫ్ చంద్రమౌళి తెలిపారు. అబ్జర్వర్గా కలందర్, తదితర అధ్యాపకులు పర్యవేక్షించారు.