174 కరోనా కేసులు... ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-08-20T07:14:17+05:30 IST

జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో 174 కరోనా కేసులు నమోదు కాగా అదే వ్యవధిలో వైరస్‌ బారిన పడి ఇద్దరు మరణించారు.

174 కరోనా కేసులు... ఇద్దరు మృతి

తిరుపతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో 174 కరోనా కేసులు నమోదు కాగా అదే వ్యవధిలో వైరస్‌ బారిన పడి ఇద్దరు మరణించారు. తాజాగా నమోదైన కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 235784కు చేరగా కొవిడ్‌ మృతుల సంఖ్య 1810కి పెరిగింది. కాగా గురువారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 1947 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 32, పీలేరులో 15, పూతలపట్టులో 13, తిరుపతి రూరల్‌, చిత్తూరు మండలాల్లో 8 చొప్పున, మదనపల్లె, చిన్నగొట్టిగల్లు మండలాల్లో 7 వంతున, కేవీబీపురంలో 6, ఏర్పేడు, పాకాల మండలాల్లో 5 చొప్పున, కేవీపల్లె, సదుం, జీడీనెల్లూరు, ఐరాల, ఎర్రావారిపాళ్యం, గంగవరం, బైరెడ్డిపల్లె మండలాల్లో 4 వంతున, తొట్టంబేడు, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో 3 చొప్పున, పుంగనూరు, కలికిరి, కుప్పం, కలకడ, కురబలకోట, శ్రీకాళహస్తి మండలాల్లో 2 వంతున, పలమనేరు, నగరి, కార్వేటినగరం, వరదయ్యపాళ్యం, గుడుపల్లె, విజయపురం, నిండ్ర, పెనుమూరు, వెదురుకుప్పం, సోమల, వాల్మీకిపురం, బంగారుపాళ్యం, సత్యవేడు, వి.కోట, పులిచెర్ల, యాదమరి, నాగలాపురం, తంబళ్ళపల్లె మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. 

Updated Date - 2021-08-20T07:14:17+05:30 IST