వ్యాక్సినతో కొవిడ్‌ను అరికట్టాలి

ABN , First Publish Date - 2021-12-30T05:52:30+05:30 IST

ప్రతిఒక్కరూ కొవిడ్‌ టీకా వేసుకుని ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టాల ని అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మూర్తీరావు ఖోకలే పేర్కొన్నారు.

వ్యాక్సినతో కొవిడ్‌ను అరికట్టాలి
విద్యార్థులకు వ్యాక్సిన వేస్తున్న కేర్‌ ఇండియా సిబ్బంది



-అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాలలో మెగా వాక్సినేషన

అనంతపురం అర్బన, డిసెంబరు 29 :  ప్రతిఒక్కరూ కొవిడ్‌ టీకా వేసుకుని ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టాల ని అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మూర్తీరావు ఖోకలే పేర్కొన్నారు.  అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవా రం మెగా వ్యాక్సినేషన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ సేవా పథకం, జిల్లా ఆరోగ్యశాఖ, కేర్‌ ఇండియా సంయుక్తాధ్వ ర్యంలో ని ర్వహించిన వ్యాక్సినేషన ద్వారా 430మంది విద్యార్థులకు పైగా కొవిడ్‌ టీకా వేయించుకున్నారని మూర్తీరావు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ సేవాపథకం అధికారి ఖలీల్‌ బాషా, నవీనకుమార్‌, కేర్‌ ఇండియా కోఆర్డినేటర్‌ దాదాపీర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-12-30T05:52:30+05:30 IST